Sunday, March 28, 2010

అమితాబ్ చేసిన తప్పేమిటి?

మహారాష్ట్ర లో ఏం జరుగుతోంది ?

 
బిగ్ బి కి జరుగుతున్నఅవమానాలు ఆయనకి కాదు యావత్ జాతికి జరుగుతున్న అవమానాలు గా భావించాలి.


దొంగలతో, అవినీతి పరులతో, ఇతర సంఘ వ్యతిరేక శక్తులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగే రాజకీయ నాయకులు, అమితాబ్ తో ఒకే వేదిక మీద కూర్చోవడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు ? అమితాబ్ చేసిన తప్పేమిటి?


పైకి గుజరాత్ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా పని చెయ్యడం ఒక కారణం గా ప్రచారం జరుగుతోంది. మరో వైపు సోనియా గాంధి కుటుంబం, బచ్చన్ కుటుంబం మధ్య పెరుగుతున్న అగాధమే కారణం అని మీడియా కోడై కూస్తోంది.
కారణం ఏదైనా కావచ్చు. ఒక పౌరుడిగానైనా అమితాబ్ ను గౌరవించాలి కదా. ఆయనను అంటరాని వ్యక్తి అని డిక్లేర్ చెయ్యడం ఒకటే తక్కువ అన్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం ఎంత వరకు సబబు?

ఇంతలో మరొక న్యూస్, దేశ రాజధాని ఢిల్లీ లో అభిషేక్ పై కూడా ఆంక్షలు విధించినట్టు, ఆయన earth hour సందర్భం గా ఇచ్చిన మెసేజ్ ను ప్రదర్శించకుండా అడ్డుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదొక అంటు వ్యాధిగా వ్యాపించదని ఆశిద్దాం.


గుజరాత్ ప్రభుత్వం, భారత్ లో భాగం కాదా? ఒక పార్టీ , లేదా వర్గానికి చెందిన వారిని ఇలా సాంఘిక వెలి వేయడం  (unless they are banned by the government) సరైన పని కాదు. ఆశ్చర్యకరంగా శివ సేన అధినేత ఇప్పుడు బచ్చన్ ను సమర్ధిస్తున్నారు. కాని అయన పార్టీ వారే అమితాబ్ పై   కత్తి గట్టి కొద్ది రోజులే అయిందని మరిచిపోయారు.


మొత్తం మీద, తన వైపు నుంచి ఎలాంటి తప్పు లేకపోయినా, ఎంతో disciplined జీవితం గడిపే అమితాబ్
కు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురు కావడం చాలా బాధ కలిగిస్తోంది.

No comments:

ఇప్పుడు సమయం ..